దీపావళిని అక్టోబర్ 20న ఎందుకు జరుపుకొంటారో తెలుసా?
జనం వాయిస్ దినపత్రిక:
దృక్ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది కార్తీక మాసంలో అమావాస్య తిథి అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:44 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 21న ముగుస్తుంది. అక్టోబర్ 20న ప్రదోష కాలం సాయంత్రం 5:51 నుంచి రాత్రి 8:19 వరకు ఉంటుంది. ఈ శుభ ఘడియల నేపథ్యంలో, జ్యోతిష్యులు అక్టోబర్ 20న దీపావళి జరుపుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. అక్టోబర్ 21 లక్ష్మీ పూజకు అనుకూలం కాదని వారు పేర్కొన్నారు.