janamvoice.com
Newspaper Banner
Date of Publish : 20 October 2025, 10:34 am Digital Edition : JANAM VOICE

దేశ ప్రజలకు మోదీ దీపావళి విషెస్.

దేశ ప్రజలకు మోదీ దీపావళి విషెస్.

జనం వాయిస్ దినపత్రిక:

దేశ వ్యాప్తంగా వెలుగుల పండుగ దీపావళి ఉత్సాహంగా జరుపుకుంటున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సామరస్యం నింపాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకట్లపై వెలుగులు గెలిచిన సంకేతంగా భావిస్తామని ఆయన అన్నారు. ప్రజలు పర్యావరణానికి హాని కలిగించకుండా సురక్షితంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

మోదీ మాట్లాడుతూ, దీపావళి మన దేశ సాంస్కృతిక విలువలకు, కుటుంబ బంధాలకు ప్రతీక అని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఒకరినొకరు స్మరించుకోవాలని, ప్రేమ, కరుణ, సహానుభూతి పంచుకోవాలని సూచించారు. “మన దేశం వైవిధ్యభరితమైన సంప్రదాయాలతో కూడినది. ఆ వైవిధ్యంలో ఏకత్వం మన బలమని దీపావళి మనకు గుర్తుచేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. అలాగే సైనికులు, పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది తమ విధుల్లో ఉన్నా దేశ ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఇక నిన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ. రేవంత్ రెడ్డి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతులతో, అభివృద్ధితో నిండిన కొత్త దశలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షించగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి “చీకట్లపై వెలుగు విజయం సాధించిన దీపావళి మన జీవితాల్లో వెలుగులు నింపాలని” అన్నారు.