పోతారంలో కలుషితమవుతున్న త్రాగునీరు.
-పట్టించుకోని అధికారులు.
జనం వాయిస్,ముత్తారం:
ముత్తారం మండలం పోతారం గ్రామంలో త్రాగునీరు కలుషితం అవుతుందని ఎస్సీ కాలనీ వాసులు అసహనం వ్యక్తం చేశారు.ఒకటవ వార్డు ఎస్సీ కాలనీకి వాటర్ ట్యాంక్ నుండి నీరు వచ్చే మధ్యలో గేట్ వాల్ దగ్గర నీటి నిలువతో నీరు కలుషితమై ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు.చిన్న పిల్లలు వృద్దులు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు.నీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని కలుషిత నీరు తాగడం వలన ఎంతోమంది ఇబ్బంది పడుకుంటూ వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారని మంథని డివిజన్ దళిత నాయకుడు ఊట్ల శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇప్పటికైనా అధికారులు నాయకులు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.