janamvoice.com
Newspaper Banner
Date of Publish : 20 October 2025, 3:14 pm Digital Edition : JANAM VOICE

మహిళ యూట్యూబర్ దారుణ హత్య.

జనం వాయిస్,హైదరాబాద్:

హర్యానాలోని సోనిపట్ జిల్లాలో మహిళా యూట్యూబర్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. జింద్ జిల్లాకు చెందిన యూట్యూబర్ పుష్పను ఆమె ప్రియుడు సందీప్.. గొంతు కోసి చంపి, ఆమెను ఉరితీశాడు. సంఘటన జరిగిన 11 రోజుల తర్వాత పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. మొదట్లో పోలీసులు దీనిని ఆత్మహత్యగా భావించారు, కానీ పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత నిజం బయటపడింది. నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.