సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ భేటీ.
జనం వాయిస్ దినపత్రిక:
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తిరుమల తిరుపతి దేవస్థాన(TTD)చైర్మన్ బి.ఆర్. నాయుడు భేటీ అయ్యారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలో చేపట్టబోయే ఏర్పాట్లు పై వారిద్దరు చర్చించినట్టు సమాచారం. సీఎం చంద్రబాబు(CM Chandrababu), టీటీడీ చైర్మన్ మధ్య సుమారు అరగంట సేపు భేటీ జరిగినట్లు తెలుస్తోంది. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై, ఇతర అంశాలు కూడా వీరి చర్చల్లో ప్రస్థావనకు వచ్చినట్లు సమాచారం.