janamvoice.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 7:11 pm Digital Edition : JANAM VOICE

గోదావరిఖని లో 19 గ్యాస్ సిలిండర్లు సీజ్.- 7 హోటల్స్ పై కేసులు నమోదు.

గోదావరిఖని లో 19 గ్యాస్ సిలిండర్లు సీజ్.

– 7 హోటల్స్ పై కేసులు నమోదు.

– అదనపు కలెక్టర్ డి.వేణు.

జనం వాయిస్, గోదావరిఖని, పెద్దపల్లి, మార్చి13:

గోదావరిఖని ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో 19 సిలిండర్లు సీజ్ చేసి, 7 హోటల్స్ పై కేసులను నమోదు చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ డి.వేణు ఒక ప్రకటనలో తెలిపారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం గోదావరిఖని ప్రాంతంలోని వివిధ హోటల్స్ లో తనిఖీలు నిర్వహించడం జరిగిందని, గృహ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 7 హోటల్స్ పై కేసులు నమోదు చేసి 19 సిలిండర్లు సీజ్ చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.