janamvoice.com
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 4:10 pm Digital Edition : JANAM VOICE

35 సంవత్సరాల పాటు ప్రజా సేవలో నిర్విరామంగా సేవలు.-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

35 సంవత్సరాల పాటు ప్రజా సేవలో నిర్విరామంగా సేవలు.

దీర్ఘకాల సేవ అనంతరం ఘన వీడ్కోలు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

జిల్లా పంచాయతీ అధికారి వీర బుచయ్య రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.

జనం వాయిస్, పెద్దపల్లి, మార్చి 31:

దీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించిన ఉద్యోగుల పదవి విరమణ వేడుకలు ఘనంగా జరిగాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం రంగంపల్లి లోని సాయి గార్డెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచయ్య పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ముఖ్య అతిథిగా హాజరై పంచాయతీ అధికారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
మాట్లాడుతూ, 30 నుంచి 35 సంవత్సరాల పాటు ప్రజా సేవలో నిర్విరామంగా సేవలు అందించి నేడు పదవి విరమణ పొందుతున్న జిల్లా పంచాయతీ అధికారికి వీడ్కోలు తెలిపారు. పెద్దపెల్లి జిల్లాలో ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగడంలో పంచాయతీ అధికారి కీలక పాత్ర పోషించారని,  కేటాయించిన విధులను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా నిర్వహిస్తూ బాధ్యతలను నెరవేర్చే వారని కలెక్టర్ గుర్తు చేశారు. పదవి విరమణ తర్వాత కూడా అవసరమైన సమయంలో ప్రభుత్వానికి తమ సూచనలు సలహాలు అందజేస్తూ సేవలు అందించాలని కలెక్టర్ కోరారు. పదవీ విరమణ తర్వాత వారు జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం  జిల్లా కలెక్టర్ పదవి విరమణ పొందిన జిల్లా పంచాయతీ అధికారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.