వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజులో రాయితీ కల్పించాలి.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు జర్నలిస్ట్ సంఘాల వినతి.
జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 22:
వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 100 % ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్,జర్నలిస్టుల సంక్షేమ సంఘం, ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న వారందరికీ 100% రాయితీ కల్పించాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల మధ్యకు తీసుకొని వెళుతున్న జర్నలిస్టులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని, అలాంటి జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో 100% రాయితీ కల్పించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా అందించడం జరిగిందని, కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ జేయు స్టేట్ ఆర్గనైజర్ సెక్రెటరీ అవునూరి సంపత్ , జెఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్, జెఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వోడ్నాల తిరుపతి, అనిల్,సంతోష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
