జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.
జనం వాయిస్, కరీంనగర్:
కరీంనగర్ లోని స్థానిక ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కలువకుంట రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కావున, ఆసక్తి గల అభ్యర్థులు 10 మార్చి 2026 లోగా తమ దరఖాస్తులను తెలుగు విభాగంలో సమర్పించగలరని కోర్స్ సమన్వయకర్త డా. బూర్ల చంద్రశేఖర్ తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలోని తెలుగు విభాగంలో సంప్రదించాలని కోరారు.