janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 7:20 pm Digital Edition : JANAM VOICE

బీఆర్ఎస్ సభ్యత్వ ఇన్చార్జిల నియామకం.

బీఆర్ఎస్ సభ్యత్వ ఇన్చార్జిల నియామకం.

– మంచిర్యాలకు కౌశిక్ హరి.
– చెన్నూర్‌కు తిప్పని లింగన్న.
– బెల్లంపల్లికి మిరియాల రాజిరెడ్డి.
– నియామకాల జాబితా విడుదల చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

జనం వాయిస్, మంచిర్యాల ప్రతినిధి, మే 21:

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అధిష్టానం ఇన్చార్జిలను నియమించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేసిన ఈ నియామకాల జాబితా ప్రకారం.. మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా కౌశిక్ హరి, చెన్నూర్ నియోజకవర్గానికి తిప్పని లింగన్న, బెల్లంపల్లి నియోజకవర్గానికి మిరియాల రాజిరెడ్డిలను నియమించారు.

పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఈ చర్యల ద్వారా ఆయా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తూ, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి ఈ ఇన్చార్జిలు పర్యవేక్షించనున్నారు. ఈ నూతన నియామకాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని, రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.