మరికొద్ది సేపట్లో బండి భగీరథ్ విడుదల.
– బెయిల్ ఉత్తర్వులతో చర్లపల్లి జైలుకు న్యాయవాది నిరంజన్ రెడ్డి.
జనం వాయిస్, హైదరాబాద్, జూలై 9:
పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టు బండి భగీరథ్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, బెయిల్ ఉత్తర్వుల ప్రతులను జైలు అధికారులకు అందజేసేందుకు న్యాయవాది నిరంజన్ రెడ్డి చర్లపల్లి కేంద్ర కారాగారానికి చేరుకున్నారు.
జైలర్కు బెయిల్ ఉత్తర్వులు సమర్పించిన అనంతరం అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తిచేసి, మరికొద్ది సేపట్లో బండి భగీరథ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
జైలు అధికారులు కోర్టు ఆదేశాల మేరకు తుది ప్రక్రియలను వేగంగా పూర్తి చేస్తున్నారు.