మంథని నూతన ఎంపీడీవో ను కలిసిన బిజెపి నాయకులు.
జనం వాయిస్,మంథని:
పెద్దపల్లి జిల్లా మంథని మండల నూతన ఎంపీడీవో గా నియమితులైన కంకణాల శ్రీజా రెడ్డి ని శనివారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు రోజా ఎంపీడీవో కు శాలువా కప్పి అభినందించారు.మండలంలోని పలు గ్రామాల సమస్యలను బీజేపీ నాయకులు వివరించారు.దానికి వారు గ్రామాల సమస్యలపై పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపారన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్,పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్,జిల్లా కౌన్సిల్ మెంబర్ తోట మధుకర్,మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రేపాక శంకర్,కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఎల్కా సదానందం,ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కరెంగుల రాజశేఖర్,పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్,జిల్లా సీనియర్ నాయకులు నార్మల కృష్ణ,బూడిద తిరుపతి,గురువేష్,బోసెల్లి శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.