చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వ్యక్తి దారుణ హత్య.
జనం వాయిస్, తెలంగాణ :
నిర్మల్ జిల్లా కడెం మండలంలో మంత్రాల నెపంతో దారుణ హత్య జరిగింది. ఉడుంపూర్ పంచాయతీ గండి గోపాల్పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్య(55)ను ఈ నెల 10న రాత్రి అదే గ్రామానికి చెందిన మూతి నరేశ్(21), అతని అన్న మల్లేశ్(23) హత్య చేశారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చంపిన అనంతరం మృతదేహాన్ని కాల్చి బూడిద చేసినట్లు పోలీసులు తెలిపారు. భీమయ్య మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతోనే హత్య చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.