janamvoice.com
Newspaper Banner
Date of Publish : 02 November 2025, 11:49 am Digital Edition : GATTU MAHESH

శ్రీవారిని దర్శించుకున్న నవ దంపతులు

శ్రీవారిని దర్శించుకున్న నవ దంపతులు

జనం వాయిస్,హైదరాబాద్‌, నవంబర్‌ 2:

టాలీవుడ్‌ నటుడు నారా రోహిత్‌ తన సతీమణి శిరీషతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అక్టోబర్‌ 30న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ నవదంపతులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీర్వాదం పొందారు.వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నారా రోహిత్‌ దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆలయం వద్ద వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.వివాహం తర్వాత తొలిసారిగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.