janamvoice.com
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 8:13 am Digital Edition : GATTU MAHESH

2029లో అధికారం మాదే: CM రేవంత్ రెడ్డి

2029లో అధికారం మాదే: CM రేవంత్ రెడ్డి.

జనం వాయిస్, తెలంగాణ:

2029లో 80 శాతానికి పైగా సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని శపథం చేశారు. అలాగే కేసీఆర్ కుటుంబం వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. సంపదలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే సొంత బిడ్డను, అల్లుడిని వెల్లగొట్టారని ఆరోపించారు. కొడంగల్లో నిర్వహించిన సర్పంచ్ సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.