క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.
– క్రిస్మస్ వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని పిలుపు.
– ఏసు ప్రభువు బోధనలు ప్రజా ప్రభుత్వానికి ప్రేరణ.
– అన్ని మతాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబాటు.
జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 25:
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదర, సోదరీమణులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఏసు ప్రభువు బోధనలు మానవత్వం, త్యాగం, ప్రేమ అనే విలువలను ప్రపంచానికి చాటాయని పేర్కొన్నారు. ఆ బోధనల స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన ఎలాంటి వివక్ష లేకుండా, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటూ పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.