మద్యం మత్తులో అర్ధనగ్నంగా రోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం.
జనం వాయిస్, మంచిర్యాల:
మద్యం మత్తులో అర్ధనగ్నంగా రోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. అనుమానంతో భార్యను నడి రోడ్డుపై కానిస్టేబుల్ రవి ప్రసాద్ చితక బాదాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనిలో అర్ధరాత్రి మద్యం మత్తులో రోడ్డుపై భార్య శిరీష పై భర్త రవి ప్రసాద్ దాడిచేసి గాయపరిచాడు. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రవి ప్రసాద్, గుడిపేట బెటాలియన్లో సూపరిండెంట్గా భార్య శిరీష విధులు నిర్వహిస్తుంది.పోలీస్ స్టేషన్లో భార్య శిరీష పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.