ఫైరింగ్ రేంజ్ లో సీపీ బంధువుల కాల్పులు.
– రేవంత్ రెడ్డిని నిలదీసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
జనం వాయిస్, కరీంనగర్:
కరీంనగర్ సీపీగౌస్ ఆలం భార్య గన్ ఫైర్ చేస్తే ఒక అభాగ్యురాలైన వృద్ధురాలికి బుల్లెట్ తగిలింది. కరీంనగర్ సమీపంలో ఉన్న ఒక ఫైరింగ్ రేంజ్లో సీపీ భార్య, అతని బంధువులు ఏకే 47, ఎస్ ఎల్ ఆర్ తుపాకీలతో కాల్పులు జరిపారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలి తొడకు బుల్లెట్ తగిలి గాయం అయింది. ఈ అంశం వి6 పేపర్లో కూడా వచ్చింది. ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ రేంజ్లో కాల్పులు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. హోంమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా అని నిలదీసారు. బహిరంగంగా కాల్పులు జరిపిన వార్తలు వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసారు.