మృతుల కుటుంబాలకు దాసరి ఉష పరామర్శ.
జనం వాయిస్, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఆరెల్లి చిన్న వెంకటయ్య గౌడ్ గుండెపోటుతో మృతి చెందగా కనగర్తి గ్రామానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి, నివాళులర్పించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పెద్దపెల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆరేల్లి స్వామి, సాయి, రామస్వామి, ఆరెల్లి రమేష్, బండ నిఖిల్, దొడ్డి అశోక్, అరుణ, రమాదేవి తిరుపతి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
కందుల ప్రమీల కుటుంబానికి పరామర్శ.
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన బీసీ నాయకుడు కందుల సదాశివ కుటుంబ సభ్యురాలు అయిన కందుల ప్రమీల అనారోగ్యం కారణంగా చనిపోగా విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష. తమ వెంట సదయ్య, ప్రసాద్, రమా, అశోక్ అశ్విని రాజగోపాల్ కూతుర్లు, మంజుల, శ్రీనివాస్ అరుణ తదితరులు ఉన్నారు.