మంథని గోదావరిలో గళ్లంతైనా యువకుడి మృతదేహం లభ్యం.
-అన్నారం బ్యారేజి వద్ద దొరికిన సాయి కృష్ణ డెడ్ బాడీ.
-బయటకు తీసిన స్థానికులు.
జనం వాయిస్,మంథని:
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మర్రివాడకు చెందిన రావికంటి సాయి కృష్ణ (30) అనే యువకుడు సోమవారం మంథని గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి గల్లంతయ్యిన విషయం తెలిసిందే.అయితే మంగళవారం సాయంత్రం సాయి కృష్ణ డెడ్ బాడీ ని అన్నారం బ్యారేజి వద్ద స్థానికులు గుర్తించారు.డెడ్ బాడీ చాలా దూరంలో ఉండడంతో స్థానికులు బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.వెంటనే కుటుంబ సభ్యులు బంధువులు అక్కడికి వెళ్లారు.