జాతీయ ప్రతిభా పురస్కారానికి దేవులపల్లి రమేశ్ ఎంపిక.
జనం వాయిస్, సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన కవి, రచయిత దేవులపల్లి రమేశ్, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల అతిధి ఉపాధ్యాయుడు.శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, మరియు గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, సంయుక్త ఆధ్వర్యంలో ప్రాచీన కవుల వారసులచే నిర్వహించే, సాహితీ సాంస్కృతిక,పట్టాభిషేక

మహోత్సవము,భాగంగా జాతీయ ప్రతిభా పురస్కారానికి కవి, దేవులపల్లి రమేశ్, అక్షర సేవలను, సాహిత్య సాంస్కృతిక తపనను సృజనాత్మకతను గుర్తించి, సాహిత్యానికి కృషి చేస్తున్నందుకు జాతీయ ప్రతిభ పురస్కారనికి ఎంపిక చేసినట్లు శ్రీశ్రీ కళా వేదిక, మేనేజింగ్ డైరెక్టర్ డా.కత్తి మండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, ప్రపంచ తెలుగు, సంస్కృతిక కళావేదిక,వారు తెలిపారు. ఈ నెల 21 న బుధవారం విజయవాడలో జరిగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియం,నందు జాతీయ ప్రతిభ పురస్కారం ప్రదానం చేయునట్లు దేవులపల్లి రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా రచయిత రమేశ్ ను సాహితివేత్తలు,పలువురు అభినందించారు.