janamvoice.com
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 12:44 pm Digital Edition : JANAM VOICE

ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ.

ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ.

జనం వాయిస్, హైదరాబాద్, జులై 19:

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి ప్రజా పంపిణీ వ్యవస్థ లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది,3 నెలల రేషన్‌ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నట్టు తెలుస్తుంది..
వచ్చే నెల ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధిం చిన రేషన్‌ బియ్యా న్ని ఒకేసారి అందిం చనున్నారు. ఈ మేర కు కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయ టంతో ఆగస్టు 1 నుంచి మూడు నెలల బియ్యం పంపి ణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు.
సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజులు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం ఇచ్చేవారు. వచ్చే నెలలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వ నుండటంతో ఆగస్టు లో 31 రోజులు దుకాణాలు తెరచి బియ్యం అందించా ల్సి ఉంది. ప్రతి రేషన్ కార్డుదారు మూడు సార్లు వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది.