janamvoice.com
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 3:54 pm Digital Edition : GATTU MAHESH

వృద్ధులకు వితంతువులకు దుప్పట్లు పంపిణీ

వృద్ధులకు వితంతువులకు దుప్పట్లు పంపిణీ

జనం వాయిస్,మంథని,నవంబర్ 16:

వృద్ధులు,దివ్యాంగులు,వితంతు పెన్షన్ దారులకు కొండ ప్రేమలత రవీందర్ దంపతులు దుప్పట్లు పంపిణీ చేశారు.ఆదివారం మంథని మండలం విలోచవరం గ్రామంలో కొండ రవీందర్ దంపతులు గ్రామంలోని నిరుపేదలకు సొంత ఖర్చులతో దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సాయం అందించడంలో భాగం కావడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విలోచవరం తాజా మాజీ సర్పంచ్ బండ రవి,మాజీ ఎంపీటీసీ లక్కాకుల స్వామి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాగం మల్లేష్, మీసాల రవి, పుట్ట సంతోష్, కౌటం రాజు, దేవరకొండ మహేందర్, దేవరకొండ గోపాల్, దేవరకొండ ఓదెలు, చెరుకు తోట రవి, జునగరి సుమన్, కార్తీక్, నవీన్, బాపు, జాగేటి బానయ్య, బండారి సమ్మయ్య, కొండ శంకర్, ఎరుకల అభిరామ్, తిరుపతి, ప్రభాకర్, శంకర్, పుట్ట రాజయ్య, లక్కాకుల కిట్టయ్య, మినుముల సమ్మయ్య, దేవరకొండ రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు.