వాహ్వా…ఏం టేస్ట్ బాయ్..హోటల్ యజమానికి పుట్ట మధూకర్ కితాబు.
జనం వాయిస్, మంథని:
సాధారణంగా రాజకీయ నాయకులు చిరు హోటల్లకు వెళ్లడం అరుదుగా జరుగుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సమయంలో మాత్రమే చిరు వ్యాపారుల వద్ద కన్పిస్తూ ఓట్లు అభ్యర్థిస్తారు. కానీ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మాత్రం అందుకు బిన్నంగా సాదారణ వ్యక్తిలా అప్పుడప్పుడు సరదాగా కాసేపు అంటూ అలా చిన్నచిన్న హోటల్లలో ముచ్చటిస్తుంటారు. బుధవారం రామగిరి మండలం బేగంపేటలో సైతం ఓ హోటల్లోకి వెళ్లి బజ్జీలు తిని..వాహ్వా ఏం టేస్ట్ ఉన్నాయ్ బాయ్ అంటూ హోటల్ యజమానికి కితాబిచ్చారు. రామగిరి మండలం బేగంపేట చౌరస్తాలోని సాయిరాం హోటల్లో బజ్జీలు, భాదుషా తిని ఆనందం వ్యక్తం చేశారు. కాగా రాజకీయ నాయకుల్లో సాదా సీదా వ్యవహరించడం ఒక్క పుట్ట మధూకర్తోనే సాధ్యమని చర్చ సాగుతోంది.