మేడారంలో కొబ్బరికాయలు విసరడంతో ఐదుగురు భక్తులకు గాయాలు.
జనం వాయిస్, మేడారం:
మేడారంలో సమ్మక్క గద్దె వద్ద భక్తులు కొబ్బరికాయలు విసరడంతో ఐదుగురు భక్తులు గాయపడ్డారు. రెస్క్యూ బృందాలు వెంటనే స్పందించి బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. భక్తులు ఎవరూ గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరకూడదని, నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని ఆలయ కమిటీ సూచించింది.