Date of Publish : 21 February 2026, 2:48 pmDigital Edition : JANAM VOICE
గంగానగర్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్టాపన మహోత్సవం.
గంగానగర్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్టాపన మహోత్సవం.
-బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి విరాళం అందజేత.
జనం వాయిస్, గోదావరిఖని:
గోదావరిఖని గంగానగర్ ప్రాంతంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి ఉదారంగా విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ..ఆలయ అభివృద్ధి ప్రతి భక్తుడి బాధ్యత అని, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఆధ్యాత్మిక చైతన్యం కలిగిస్తాయని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ జి బి కే ఎస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పోలాడి శ్రీనివాసరావు, పరశురాములు, భయపు రాజిరెడ్డి, రమేష్, కాసర్ల సురేష్, అడ్డగట్ల గోపి, నడిపెల్లి సాయి, కటకనేని శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు., ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.