తెలంగాణలో ‘శంకర వరప్రసాద్’కు టికెట్ ధరల పెంపుకు గ్రీన్సిగ్నల్.
జనం వాయిస్, సినిమా:
తెలంగాణలో మన శంకర వరప్రసాద్ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి వారం రోజుల పాటు ధరల పెంపునకు వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్పై రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరకు పెంచుకునే అవకాశం ఇచ్చింది. అలాగే రేపు ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు.