janamvoice.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 4:00 pm Digital Edition : GATTU MAHESH

ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు సన్మానం.

ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు సన్మానం.

జనం వాయిస్, మంథని:

ఇటీవల ఎలక్ట్రానిక్‌ మీడియా మంథని డివిజన్‌ ప్రెస్‌క్లబ్‌ ఏర్పాటు చేసుకున్న  మీడియా ప్రతినిధులను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ సన్మానించారు. బుధవారం మంథనిలోని రాజగృహాలో ఆయనను మీడియా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలువగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సన్మానించారు. ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు నిజాలను నిర్బయంగా వెలుగులోకి తీసుకురావాలని, ప్రజలను చైతన్యం చేసే దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నూతనంగా ఏర్పాటైన క్లబ్‌ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను సన్మానించారు.