హోటళ్లు బంద్..తిరుమల అన్నదాన సత్రంపై ఒత్తిడి.
జనం వాయిస్, తిరుమల:
తిరుమలలో గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో కొండపైన 50కి పైగా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో భక్తులంతా టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత అన్నప్రసాదంపై ఆధారపడుతున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెల అదనంగా లక్ష మందికి పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు సమాచారం. రోజుకు సుమారు 6 టన్నుల గ్యాస్ను వాడుతున్నా, హోటళ్ల మూసివేతతో అన్నదాన సత్రాలపై ఒత్తిడి గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది.