janamvoice.com
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 9:55 am Digital Edition : JANAM VOICE

డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి గా జోడు సురేష్.

డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి గా జోడు సురేష్.
  
గోదావరిఖని, జూన్ 29, (జనం వాయిస్):

మంథని పట్టణంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం నిర్వహించిన డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ సమావేశంలో పెద్దపల్లి జిల్లా కమిటీని ప్రకటించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు తంగళ్లపల్లి అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ధార మధు ఆధ్వర్యంలో జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజాక్షేత్రం దినపత్రిక గోదావరిఖని కి  చెందిన జోడు సురేష్ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి గా నియమించారు. ఈ నియామకంపై పాత్రికేయ మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ జోడు సురేష్ కు అభినందనలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తానని జోడు సురేష్ పేర్కొన్నారు.