janamvoice.com
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 7:46 am Digital Edition : GATTU MAHESH

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం.

జనం వాయిస్,హైదరాబాద్:

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రారంభమైంది. యూసుఫ్‌గూడ  కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. స్టేడియంలో ఒక వరుసకు 21 టేబుళ్ల చొప్పున.. రెండు వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 407 పోలింగ్‌ కేంద్రాల ఫలితాలు వెల్లడయ్యేవరకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. బిహార్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇంకొన్ని గంటల్లో ఫలితాలు తేలిపోనున్నాయి. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు.