శ్రీరామనవమి తర్వాత కవిత కొత్త పార్టీ ప్రకటన!
జనం వాయిస్, వెబ్ డెస్క్:
శ్రీరామనవమి తర్వాత కవిత కొత్త పార్టీ ప్రకటన!
తెలంగాణ : శ్రీరామనవమి తర్వాత ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని, శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీని ప్రకటిస్తారని సమాచారం. దీనికి సంబంధించిన అజెండాపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. సామాజిక తెలంగాణ ధ్యేయంతో సర్వోదయ తెలంగాణ దిశగా ముందుకు వెళ్తానని, మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తున్నట్టు కవిత తెలిపారు. పార్టీ ప్రారంభించినప్పుడే అజెండా, లక్ష్యాలు ప్రకటిస్తామని, కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ముందుకు వెళ్తామని చెప్పారు.