janamvoice.com
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 9:06 pm Digital Edition : GATTU MAHESH

హైదరాబాద్ చేరుకున్న ఫుట్ బాల్ దిగ్గజం మెస్సి!

హైదరాబాద్ చేరుకున్న ఫుట్ బాల్ దిగ్గజం మెస్సి!

జనం వాయిస్, హైదరాబాద్:

అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. మెస్సీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నగరానికి విచ్చేశాడు. రోడ్డు మార్గం ద్వారా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నాడు ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, మెస్సీతో ‘మీట్ అండ్ గ్రీట్’ సెషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెస్సీని కలిసేందుకు 100 మందికి అవకాశం కల్పించారు. వారికి ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను జారీ చేశారు. మెస్సీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థి తులు తలెత్తిన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియం నుంచి మెస్సీ త్వరగా వెళ్లిపోవడంపై ఆగ్రహించిన అభిమానులు కుర్చీలు, నీళ్ల బాటిళ్లు విసిరి నిరసన తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనున్న ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 3 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. మ్యాచ్‌ టిక్కెట్ ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోనికి అనుమతించనున్నారు. వాహనాల పార్కింగ్ కోసం 34 ప్రదేశాలలో ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్టేడియం, దాని పరిసర ప్రాంతాలను సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.50 గంటల కు ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.రాత్రి 8.05 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేడియానికి విచ్చేస్తారు. రాత్రి 8.06 గంటలకు మెస్సీ మైదానంలోకి ప్రవేశిస్తారు.రాత్రి 8.08 గంటలకు రోడ్రిగో, లూయిస్ సువారెజ్ మైదానంలోకి వస్తారు.

రాత్రి 8.13 గంటలకు పెనాల్టీ షూటౌట్ ఉంటుంది.
రాత్రి 8.18 గంటలకు రాహుల్ గాంధీ మైదానంలోకి వస్తారు.