janamvoice.com
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 12:21 pm Digital Edition : JANAM VOICE

మండే ఎండలకు పశువులు,పక్షులు విలవిల!.

  • మండే ఎండలకు పశువులు,పక్షులు విలవిల!.
  • ప్రాణాలు వదులుతున్న పశువులు, రామచిలుకలు.
  • జనం వాయిస్, వెబ్ డెస్క్, మే 23:
  • తెలంగాణ రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడం తో ప్రజలు ఉక్కిరి, బిక్కిరి, అవుతున్నారు భానుడి భగభగలకు కొన్ని ప్రాంతాలలో వడదెబ్బలు తగిలి జనాలు మరణిస్తున్నా రు.కేవలం మనుషులే కాకుండా  పశువులు, పక్షులు కూడా ఎండ తీవ్రతకు ప్రాణాలు కోల్పోవడం కలచి వేస్తుంది,శనివారం మెదక్ జిల్లా తూప్రాన్ లో మండే ఎండలకు ఓ రైతుకు సంబంధిం చిన ఎద్దు మరణించింది. అలాగే కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం పరిధిలోని బోర్నపల్లి శివారులో శుక్రవారం మధ్యాహ్నం ఎండ తీవ్రతను తట్టుకోలేక రామచిలుకలు రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి.