మంథని గంగాపురి వద్ద లారీ ఆక్సిడెంట్.
జనం వాయిస్, మంథని:
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి వద్ద లారీ ఆక్సిడెంట్ జరిగింది.మంథని పోచమ్మ వాడకు చెందిన లక్కాకుల సంతోష్ కు గంగపూరి వద్ద లారీ ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికులు గమనించి హాస్పిటల్ కు తరలించగా మంథని ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

