త్వరలో మహిళలకు ‘మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు’ పంపిణీ.!
జనం వాయిస్, తెలంగాణ:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో త్వరలో కీలక మార్పులు రానున్నాయి. మహిళలకు ‘మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు’ పంపిణీకి ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆధార్ లేదా ఓటర్ ఐడీ కార్డులు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ కోసం జీరో టికెట్ పొందుతున్న విషయం తెలిసిందే. చిప్తో కూడిన ఈ కార్డులో 16 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. కార్డు ముందు భాగంలో మహిళ ఫోటోతో పాటు పేరు, గ్రామం, మండలం, జిల్లా వివరాలు ముద్రించి ఉంటాయి.