- ఏసీబి కి చిక్కిన మంథని సబ్ రిజిస్ట్రార్.
- 16,500 లంచం తీసుకుంటూ బుక్.
- జనం వాయిస్, మంథని :
పెద్దపల్లి జిల్లా మంథనిలో ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన కలకలం రేపింది. మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపుకు చెందిన ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రూ. 16,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మంథని రిజిస్టర్ కాసర్ల రాజేందర్, డాక్యుమెంట్ రైటర్ రషీద్. ఇంచార్జ్ కరీంనగర్ ఏసీబీ డిఎస్పి మధు ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు.