మంథని లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత.
జనం వాయిస్, మంథని:
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ పరిధిలోని ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై శుక్రవారం ఉదయం మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు.మంథని మున్సిపల్ పరిధిలోని గంగపురి నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ కుర్ర లింగయ్య మంథని బొక్కల వాగు సమీపాన నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు జెసిబి యంత్రాలతో కూల్చివేశారు.ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొన్నది.మంథని పోలీస్ ఆధ్వర్యంలో పోలీసు పహారా మధ్య, మున్సిపల్ సిబ్బంది శుక్రవారం ఆక్రమణలను కూల్చివేయించారు.ఇంకా మంథనిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని స్థానికుల నుంచి డిమాండ్లు వినపడుతున్నాయి.దీంతో మంథనిలో అక్రమ కట్టడాల నిర్మాణాల దారుల గుండెల్లో అలజడి మొదలైంది.