తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న మెడికల్ దుకాణాల బంద్..!
జనం వాయిస్, వెబ్ డెస్క్, మే 20:
ఆన్లైన్ ఫార్మసిలా అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపార రంగాల పిలుపు మేరకు బుధవారం దేశవ్యా ప్తంగా మెడికల్ దుకాణాల బంద్ కొనసాగుతుంది, ఈ బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది,తెలంగాణలో దాదాపు 25 వేలకు పైగా దుకాణాలు మూతపడగా, ఒక్క హైదరాబాద్ నగరం లోని 12 వేల మెడికల్ షాపులు ఈరోజు తెరుచుకోలేదు,
ఆన్లైన్ మందుల అమ్మకాల వల్ల మెడికల్ షాపుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, దీనిపై ఆధారపడిన కోట్ల మంది జీవనో పాధి ప్రమాదంలో పడిందని అసోసి యేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.దీంతో పాటు ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన నకిలీ ప్రిస్క్రిప్షన్లతో యాంటీ బయాటిక్స్, మత్తు కలిగించే మం దులను సులభంగా పొందుతు న్నారని, ఇది ప్రజారో గ్యానికి తీవ్ర ముప్పని అంటున్నారు.పెద్ద పెద్ద కార్పొరేట్ ఆన్లైన్ సంస్థలు మందులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తూ మార్కెట్ను శాసిస్తున్నాయని, దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్న మెడికల్ షాపుల యజమానులు తీవ్రం గా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్-19 సమయం లో మందుల హోమ్ డెలివరీ కోసం కేంద్ర ప్రభుత్వం తాత్కాలి కంగా తెచ్చిన అత్య వసర నోటిఫికేషన్లను (GSR 220(E), GSR 817(E)) ఇప్పటికీ కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిబంధనలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలంగాణ డ్రగ్గిస్ట్స్ అండ్ ఫార్మాసిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ గుప్తా మీడియాకు తెలిపారు.