ఇవాళ రాత్రి నుంచి రెండు రోజుల పాటు మీ సేవలు బంద్..!
జనం వాయిస్, వెబ్ డెస్క్:
కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కోసం ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని మీసేవ నిర్వాహకులు తెలిపారు. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ కావడానికి 36 గంటల సమయం పట్టనుంది. శనివారం, ఆదివారం సెలవులు కావడంతో, మీసేవలు సోమవారం ఉదయం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని నిర్వాహకులు ప్రజలకు సూచించారు.