మాజీ ఎమ్మెల్యే మృతికి మంత్రి శ్రీధర్ బాబు సంతాపం.
జనం వాయిస్, మంథని:
పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే(1994-1999) చంద్రుపట్ల రాంరెడ్డి మరణం విచారకరమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సంతాపం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచిగా, ఎంపీపీగా, శాసనసభ్యునిగా ఆయన మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవ చేశారని,వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.