ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా పులి సదానందం.
జనం వాయిస్,మంథని,నవంబర్ 1:
మంథని మండలం సూరయ్యపల్లి గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా పులి సదానందం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం సూరయ్యపల్లిలో ముదిరాజ్ సంఘం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పులి సదానందం,ఉపాధ్యక్షులుగా సుంకరి దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా బొల్లి ప్రసాద్, సహాయ కార్యదర్శిగా బొల్లి రవి,కోశాధికారిగా బీర్క సదానందం,కార్యవర్గ సభ్యులుగా సుంకరి సదాశివ్, జోడు రాజు, ముఖ్య సలహాదారులుగా బీర్కా లక్ష్మన్, బీర్కా రాము, చింతకింది సత్తయ్య, బీర్క సాగర్ లను ఎన్నుకోవడం జరిగింది.