తిరుమలగిరిలో క్షుద్ర పూజలు కలకలం.
బొమ్మలు,నిమ్మకాయలు చూసి గ్రామస్తుల ఆందోళన.
పాలకుర్తి, జూన్ 6 జనం వాయిస్:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామంలో శనివారం చేతబడి కలకలం రేపింది.గ్రామంలోని ఓ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించినట్లు ఆధారాలు లభ్యమవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం… శనివారం ఉదయం గ్రామ శివారులోని చేతబడికి ఉపయోగించే బొమ్మలు, నిమ్మకాయలు,పసుపు, కుంకుమ చల్లిన పూజా సామాగ్రి పడి ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆధునిక కాలంలోనూ కొందరు ఇలాంటి మూఢనమ్మకాలతో గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.