రైతన్నకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.
-వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
-కొనుగోలు కేంద్రాలలోనే వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి.
-పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు.
జనం వాయిస్, పెద్దపల్లి:
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.జూలపల్లి మండలం పెద్దాపూర్,తెలుకుంట గ్రామాల్లో సింగిల్ విండో,ఐకేపీ ఆధ్వర్యంలో సోమవారం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు గ్రామస్తులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.