బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.
బిర్యానీ కోసం ఎగబడ్డ జనం. జనం వాయిస్, హన్మకొండ, జూలై 03: హనుమకొండలో హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా 300 ఉచిత బిర్యానీ ప్యాకెట్ల ఆఫర్ గందరగోళానికి దారితీసింది. ఆఫర్ కోసం సుమారు వెయ్యి మందికి పైగా జనం ఒక్కసారిగా ఎగబడటంతో భారీ తోపులాట జరిగింది. స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.