నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల.
జనం వాయిస్,నవంబర్ 19:
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద 21వ విడత నిధులను ఈ రోజు (బుధవారం) విడుదల చేయనుంది.ఈ కార్యక్రమంలో భాగంగా,దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా రైతులకు రూ. 2,000 చొప్పున ఆర్థిక సహాయం వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడుతుంది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విడుదల కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తారు.