ఉరేసుకొని 8 నెలల గర్భిణీ ఆత్మహత్య.
-రామగిరి మండలం లోంకకేసారంలో ఘటన.
జనం వాయిస్,రామగిరి:
పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం లొంకకేసారం గ్రామంలో అమానుషమైన సంఘటన చోటుచేసుకుంది.శుక్రవారం ఉదయం ఎనిమిది నెలల గర్భిణీ ఉరేసుకొని అనుమానస్పదంగా మృతి చెందింది.స్థానికుల వివరాల ప్రకారం లోంకకేసారం గ్రామానికి చెందిన వేముల సుప్రియ (24) భర్త పేరు సతీష్ ఎనిమిది నెలల గర్భిణీ.ఈ రోజు (శుక్రవారం) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఇది హత్య ఆత్మహత్య అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..?మృతురాలికి ఇప్పటికే ఒక కోడుకు ఉన్నాడు.నిండు గర్భిణీ మృతిచేందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.