ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు..అస్సాం ఎన్నికల ప్యానెల్‌కు నేతృత్వం.

ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు..అస్సాం ఎన్నికల ప్యానెల్‌కు నేతృత్వం.జనం వాయిస్, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అస్సాం రాష్ట్ర అభ్యర్థుల ఎంపిక ప్యానెల్‌కు చైర్‌పర్సన్‌గా ఆమెను నియమించింది. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్యానెల్‌లను ఏర్పాటు చేసింది. ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలోని అస్సాం...