హయత్‌నగర్‌లో విషాదం.. కారు ఢీకొని ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

హయత్‌నగర్‌లో విషాదం..కారు ఢీకొని ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి.-తండ్రికి తీవ్ర గాయాలు.జనం వాయిస్, హైదరాబాద్‌: నగరంలోని హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆర్టీసీ కాలనీ సమీపంలో రోడ్డు దాటుతున్న సమయంలో అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తండ్రి పాండు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఐశ్వర్యను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే...