సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుభాకాంక్షలు.
సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుభాకాంక్షలు. జనం వాయిస్, భద్రాద్రి కొత్తగూడెం:సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రతి ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే గొప్ప పండుగగా సంక్రాంతి నిలుస్తుందని పేర్కొన్నారు. పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు జరుపుకునే ఈ పండుగ...